
సినిమాలు

క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కీలక ఊరట కల్పించింది. నిర్ణీత గడువు తేదీ ముగిసిన వెంటనే ఖాతాను ‘ఓవర్ డ్యూ’గా పరిగణించకూడదని స్పష్టం చేసింది. గడువు ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశించింది. ఈ మూడు రోజులలోపు బకాయిని చెల్లిస్తే, దానిని ఆలస్యంగా పరిగణించకపోగా, క్రెడిట్ స్కోర్పై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.
ఇంతకుముందు బ్యాంకులు మొత్తం బిల్లుపై జరిమానాలు విధించేవి. అయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం, గడువు తర్వాత మిగిలిన నికర బకాయి మొత్తంపైనే జరిమానా విధించాలి. దీంతో వినియోగదారులపై పడే భారం కొంత తగ్గనుంది.
అయితే ఆలస్యమైన రోజుల లెక్కింపు మాత్రం అసలు గడువు తేదీ నుంచే ప్రారంభమవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మార్పులతో క్రెడిట్ కార్డు వినియోగదారులకు మరింత ఉపశమనం లభించనుంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!