

అర్జున అవార్డు గ్రహీత, టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ను క్రీడల కోటా కింద ఎన్టీఆర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశను మైనేని సాకేత్ కలుసుకుని తన జాయినింగ్ రిపోర్టును సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏషియన్ గేమ్స్ సహా పలు అంతర్జాతీయ టెన్నిస్ పోటీల్లో సాకేత్ ప్రతిభ చూపించి పతకాలు సాధించారని ప్రశంసించారు. క్రీడాకారులను ప్రోత్సహించే భాగంగా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించిందని తెలిపారు.
భవిష్యత్తులో కూడా అంతర్జాతీయ క్రీడా పోటీల్లో విజయాలు సాధించి దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా పరిపాలన తరఫున అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఇక వచ్చే వారంలో జరిగే ఏటీపీ ఛాలెంజర్ టూర్ పోటీల కోసం ఐరోపా పర్యటనకు వెళ్లనున్నట్లు సాకేత్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!