
జనరల్

బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ నెల 18న హైదరాబాద్లో కాంట్రాక్టర్ల మహాసభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గత మూడేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో దాదాపు ₹20 వేల కోట్ల పెండింగ్ ఉందని మాజీ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి తెలిపారు.
పనులు పూర్తిచేసేందుకు అప్పులు చేసిన అనేక మంది కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురయ్యారని, కొందరు గుండెపోటుతో మరణించగా మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంఘం వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!