
బిజినెస్

గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రధాన దేవాలయాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం నుంచి భద్రాచలం దేవాలయం వరకు ఉన్న ఆలయాలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.
దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఉపసమితి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేవాలయాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేసే సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వంటి ప్రముఖ క్షేత్రాలతో పాటు మధ్యలో ఉన్న ఇతర దేవాలయాలకు కూడా రహదారి సౌకర్యాలు మెరుగుపరచాలని పేర్కొన్నారు.













.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!