

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్లోని జిఎంఆర్ ఏరోస్పేస్ పార్క్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసిన విక్రం ఒకటి రాకెట్కు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అక్కడి సదుపాయాలను పరిశీలించి సంస్థ పురోగతిని అభినందించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యతపై మాట్లాడారు. ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో కూడిన మనవులను తయారు చేస్తామని చెప్పారు. అన్ని నైపుణ్యాలకు సంబంధించిన విద్యను ఒకే వ్యవస్థలోకి తీసుకువస్తామని వివరించారు.
అదే విధంగా విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను మార్చుతున్నామని చెప్పారు. ఐటీఐలను టాటా సమూహం సహకారంతో ఆధునిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థిపై లక్షా ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!