
గాసిప్స్
.jpeg&w=3840&q=75)
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ప్రతిష్టాత్మక PSLV-C62 రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ ప్రయోగంలో 1,485 కిలోల బరువు కలిగిన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. EOS-N1కు ‘అన్వేష’ అనే పేరును ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రయోగం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక మైలురాయి సాధ్యమైంది.
హైపర్స్పెక్ట్రల్ టెక్నాలజీతో పనిచేసే ‘అన్వేష’ ఉపగ్రహం భూమి ఉపరితలాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించనుంది. సరిహద్దుల పర్యవేక్షణ, వ్యూహాత్మక నిఘా కార్యకలాపాలతో పాటు రక్షణ, విపత్తు నిర్వహణ రంగాల్లో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించనుంది. పర్యావరణ మార్పులు, భూసంపదల అధ్యయనం వంటి అనేక అవసరాలకు ‘అన్వేష’ కీలకంగా ఉపయోగపడనుందని ఇస్రో తెలిపింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!