
రాజకీయాలు

గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి మరణంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం చెప్పి, దేశానికే ఆదర్శంగా నిలిచేలా గంగదేవిపల్లి గ్రామాన్ని తీర్చిదిద్దడంలో రాజమౌళి కీలక పాత్ర పోషించారని కేసీఆర్ తెలిపారు.
గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసి అన్ని రంగాల్లో పురోగతి సాధించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన నాయకుడిగా రాజమౌళిని కేసీఆర్ కొనియాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పల్లె ప్రగతి వంటి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన అనుభవాన్ని ప్రభుత్వం వినియోగించుకుందని గుర్తుచేశారు. రాజమౌళి మరణం దేశ పంచాయతీ రాజ్ వ్యవస్థకు తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!