
గాసిప్స్

గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ “హలో ఫ్రెండ్… హౌ ఆర్ యూ?” అంటూ ఆత్మీయంగా పలకరించడంతో ఆ వాతావరణం ప్రత్యేకంగా మారింది.
అనంతరం సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులు, సీఎస్ విజయానంద్ను బిల్ గేట్స్కు పరిచయం చేశారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్ను మంత్రి నారా లోకేష్ స్వాగతించారు. విమానాశ్రయంలో జరిగిన స్వాగత కార్యక్రమంలో పలువురు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు పాల్గొనగా, ఈ పర్యటన రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యమైనదిగా మారింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!