
గాసిప్స్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఇందులో సుప్రభాతం, తోమాల సేవ, అర్చన వంటి సేవలు ఉన్నాయి. భక్తులు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో ఈ-డిప్కు నమోదు చేసుకోవచ్చు.
టికెట్లు పొందిన వారు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లించాలి. అలాగే 22వ తేదీన కల్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్లు, 23న అంగ ప్రదక్షిణ మరియు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, 24న వసతి గదులు మరియు రూ.300 దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!