

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేరుతో సైబర్ మోసగాళ్లు నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తెరిచినట్టు ఆయన వెల్లడించారు. ఈ నకిలీ ఖాతా ద్వారా ఆయన స్నేహితులకు “సమస్యలో చిక్కుకున్నాను, వెంటనే డబ్బు పంపండి” అంటూ సందేశాలు పంపుతున్నారని చెప్పారు. ఆ సందేశాన్ని నమ్మిన ఒక వ్యక్తి ఇప్పటికే ₹20,000 పంపించడంతో మోసపోయినట్టు ఆయన తెలిపారు.
డబ్బు అడిగే ఏ సందేశాన్ని నమ్మకూడదని, ముందుగా ఆ వ్యక్తిని ఫోన్లో సంప్రదించి నిర్ధారించుకోవాలని ప్రజలకు సూచించారు. తెలియని వ్యక్తుల నుండి వచ్చే లింకులు, సందేశాలు, వీడియో కాల్స్ను వెంటనే బ్లాక్ చేయాలని చెప్పారు.
అలాగే అనుమానాస్పదమైన వెబ్సైట్లు మరియు లావాదేవీలను దూరంగా పెట్టాలని సూచించారు. ఏవైనా సైబర్ మోసాలు గమనించిన వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయవచ్చు లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు.














.avif&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!