
టెక్నాలజీ

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మంథా తుఫాను తీవ్ర తుఫానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.
ప్రస్తుతం ఈ తుఫాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది మచిలీపట్నం నుంచి 190 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 270 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఏపీఎస్డీఎంఏ అంచనా ప్రకారం, మంథా తుఫాను ఈ రాత్రికి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.
పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.










కామెంట్స్ (1)
అందరూ జాగ్రత్తగా ఉండండి