ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు హైదరాబాద్లోని ప్రజాభవన్కు చేరుకుని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షి దంపతులను ఆశీర్వదించారు. ప్రజాభవన్కు విచ్చేసిన చంద్రబాబుకు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని దంపతులు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో నిండాలని ఆశీర్వాదాలు అందించారు.
ఈ నెల 5న సూర్య విక్రమాదిత్య వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భట్టి విక్రమార్క స్వయంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లి చంద్రబాబును వివాహానికి ఆహ్వానించారు. అయితే అప్పట్లో ఉన్న అత్యవసర కార్యక్రమాలు మరియు బిజీ షెడ్యూల్ కారణంగా చంద్రబాబు ఆ వేడుకకు హాజరుకాలేకపోయారు. దీంతో తాజాగా ప్రజాభవన్కు ప్రత్యేకంగా వచ్చి నూతన దంపతులను కలుసుకుని తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!