

మెడికల్ కాలేజీల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఇటీవల జరిగిన తనిఖీల్లో సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ కాలేజీలపై కేసులు నమోదు చేసిన తర్వాత, వాటి ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగి దాడులు ప్రారంభించారు.
అమరావతి, నవంబర్ 27:
రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో అవినీతి, అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు గురువారం ఏకకాలంలో అనేక మెడికల్ కాలేజీలపై సోదాలు నిర్వహించారు. గతంలో కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) పీజీ సీట్ల కేటాయింపులో విపరీతమైన అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో, సీబీఐ అధికారులు ఇటీవల మెడికల్ కౌన్సిల్ సభ్యులతో పాటు కాలేజీల ప్రతినిధులను దీర్ఘంగా విచారించారు. అనంతరం ఈడీ అధికారులు ప్రత్యక్షంగా చర్యలు తీసుకుని దాడులను చేపట్టారు.
అదే సమయంలో, దేశవ్యాప్తంగా కూడా ఈడీ అధికారులు సోదాలు కొనసాగించారు. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఈడీ దాడులు జరిగాయి.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ తనిఖీల సమయంలో తాత్కాలిక ఏర్పాట్లతో కాలేజీలు మోసపూరిత చర్యలు చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. ఎన్ఎంసీ ప్రమాణాలు పాటించకుండా అనుమతులు పొందినట్లు కూడా విచారణలో బయటపడింది. దీనిపై సీబీఐ కేసులు నమోదు చేయగా, ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సోదాలు నిర్వహించింది.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!