
న్యూస్

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కేరళ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తమ తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కేరళలో మొదటి విడతలో 47 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తూ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది.
అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మొదటి విడతలో 144 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి రాష్ట్రంలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ఆయన మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోటీ చేయనుండటం ఈ ఎన్నికల్లో కీలక పోరుగా మారనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!