

వివాదాస్పద వీడియోలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న యూట్యూబర్ అన్వేష్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఈసారి ఆయన తన కలకు సంబంధించిన వ్యాఖ్యలతో కొత్త వివాదానికి తెరలేపాడు. అంజనేయ స్వామి, విష్ణుమూర్తి తన కలలోకి వచ్చి తనకు సూచనలు ఇచ్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ మేరకు అన్వేష్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒక వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో మాట్లాడుతూ, “విష్ణుమూర్తి నా కలలోకి వచ్చి ప్రజా సమస్యల పై పోరాటం చేయాలని చెప్పారు. బూతులు మాట్లాడకుండా, సమాజానికి ఉపయోగపడే అంశాల పై మాట్లాడాలని హితవు పలికారన్నారు” అని పేర్కొన్నాడు.
అదే వీడియోలో ఆయన మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో కాషాయం రంగు, మత మత్తు పేరుతో అన్యాయాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా మహిళల సమస్యల పై పోరాటం చేయాలని దేవుళ్లు తనకు చెప్పారంటూ వ్యాఖ్యానించాడు. ఇక పై బూతులు మాట్లాడనని, విష్ణుమూర్తి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని కూడా అన్వేష్ వీడియోలో చెప్పుకొచ్చాడు.
ఈ వీడియో వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. కొందరు నెటిజన్లు ఇది కొత్త నాటకమని విమర్శిస్తుండగా, మరికొందరు కావాలనే హిందూ దేవుళ్ల పేర్లను ఉపయోగించి వీడియోలు చేస్తున్నాడంటూ అన్వేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు మరోసారి వివాదంగా మారాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!