

కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ కమెడియన్ సూరితో గతంలో ఏర్పడిన విభేదాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. తమ మధ్య ఉన్న అపార్థాలన్నీ 2024లోనే పూర్తిగా తొలగిపోయాయని తెలిపారు. ఇకపై ఈ పాత విషయాన్ని పదేపదే చర్చించడం ఆపేయాలని అభిమానులు, నెటిజన్లను కోరారు. తాము గత విభేదాలను పరిణతితో పక్కనపెట్టి ప్రస్తుతం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నామని, ఒకరికొకరు మంచి జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు.
విష్ణు విశాల్ సూరితో కలిసి ఉన్న ఫొటోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అసలు వివాదం 2020లో విష్ణు విశాల్ తండ్రికి సంబంధించిన భూ లావాదేవీ వ్యవహారంతో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశంలో సూరి పోలీసులను ఆశ్రయించడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో వారు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే కాలక్రమేణా విభేదాలను పక్కనపెట్టి 2024లోనే సమస్యను పరిష్కరించుకున్నారు. ఇప్పటికైనా పాత వివాదాన్ని పూర్తిగా వదిలేసి ముందుకు సాగాలని విష్ణు విశాల్ సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!