

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పార్వతీపురంలో జనసైనికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రహదారులు, తాగునీరు, విద్యుత్, రవాణా వంటి మౌలిక వసతుల కల్పనతో గిరిజన ప్రాంతాల్లో మార్పు ప్రారంభమైందన్నారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు, అత్యవసర వైద్యం కోసం డోలీలపై ఆధారపడే పరిస్థితిని తొలగించేందుకు ‘డోలీ రహిత ఆంధ్రప్రదేశ్’ దిశగా చర్యలు చేపడుతున్నారని చెప్పారు.
ప్రతి జనసైనికుడు గిరిజన గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని నాగబాబు సూచించారు. పరిష్కరించగల సమస్యలకు వెంటనే సహాయం చేయడంతో పాటు, ఇతర సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పార్వతీపురం పర్యటన సందర్భంగా నాగబాబు సమక్షంలో పలువురు ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!