
జనరల్

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి చెందడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామీణ జీవనాన్ని వెండితెరపై సహజత్వంతో ఆవిష్కరించి తమిళ సినిమాకు కొత్త దిశ చూపిన ఆయనను అభిమానులు “దర్శక ఇమయం”గా పిలుస్తారు.
1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా, 1977లో వచ్చిన 16 వయతినిలే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. రాధా, రాధికా, రేవతి, కార్తీక్ వంటి నటీనటులను పరిచయం చేసి ఎన్నో క్లాసిక్ చిత్రాలు రూపొందించారు. సిగప్పు రోజక్కల్, కిజక్కే పోగుం రైల్, అలైగల్ ఓయ్వతిల్లై, ముదల్ మరియాదై, కరుత్తమ్మ వంటి చిత్రాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. తెలుగు, హిందీ సినిమాల్లోనూ ఆయన పనిచేశారు. 6 జాతీయ అవార్డులు, పద్మశ్రీ (2004) వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!