
జనరల్

ఖాతాల్లో కనీస నిల్వ నిర్వహించకపోవడంతో బ్యాంకులు 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ₹7,087 కోట్లను వసూలు చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్లో వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రైవేట్ బ్యాంకులు ₹4,948.71 కోట్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ₹2,137.92 కోట్లు వసూలు చేశాయి. ఈ రుసుములు సేవింగ్స్ మరియు కరెంట్ ఖాతాలపై విధించబడ్డాయి.
రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు అని, వ్యక్తిగత బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ₹1,798.14 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, యాక్సిస్ బ్యాంక్ ₹1,081.33 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. కనీస సగటు నిల్వ లేకపోవడంతో ఈ రుసుములు వసూలు చేసినట్లు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!