
జనరల్

విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న కుటుంబ కథా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో చిత్రంపై మరింత ఆసక్తిని పెంచింది.
ఈ చిత్రంలో వెంకటేష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలు, వినోదం, హాస్యం, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో ఈ చిత్రం పూర్తి స్థాయి కుటుంబ వినోద చిత్రంగా రూపొందుతోంది. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!