

నటుడు విశాల్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ‘మకుటం’ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు రవి అరసు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో విశాల్ స్వయంగా సినిమాను తెరకెక్కించే బాధ్యతలు తీసుకున్నారు. హీరోగా నటించడంతో పాటు దర్శకుడిగానూ వ్యవహరించిన ఆయనకు ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. విడుదలైన మొదటి రోజు నుంచే సినిమాపై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. కథనం పాత పద్ధతిలో ఉండటం, రొటీన్ ట్రీట్మెంట్, ఎక్కువగా కనిపించిన మూస ధోరణులు సినిమాకు ప్రధాన సమస్యలుగా మారాయి. కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు సినిమాను పెద్దగా ఆదరించలేకపోయారు.
ప్రతికూల సమీక్షలు, నెగెటివ్ ప్రచారం కారణంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గినట్లు సమాచారం. ముఖ్యంగా వారాంతపు వసూళ్లు కూడా రూ.2 కోట్ల మార్కును దాటలేదని తెలుస్తోంది. దీంతో నిర్మాణ వ్యయాలను రికవర్ చేయడం కూడా కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హీరోగా, దర్శకుడిగా ఒకేసారి బాధ్యతలు చేపట్టిన విశాల్కు ఈ ఫలితం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. సినిమా ఫలితంపై చిత్రబృందం నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!