

చాలా కాలం తర్వాత ఎవర్గ్రీన్ బ్యూటీ త్రిష సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ పేరు పెట్టని చిత్రానికి లండన్లో రెగ్యులర్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో త్రిషతో పాటు సీనియర్ నటి రాధికా శరత్కుమార్, నేషనల్ అవార్డు విజేత అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఎయిర్లిఫ్ట్’, ‘చెఫ్’, ‘పిప్పా’ వంటి చిత్రాలను తెరకెక్కించిన రాజా కృష్ణ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
బాలీవుడ్లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన పనోరమా స్టూడియోస్ సంస్థ కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ల నేతృత్వంలో లోకోమోటివ్ గ్లోబల్, ఫ్యూజన్ ఫ్లిక్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్తో పనోరమా స్టూడియోస్ తొలిసారి తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. ముగ్గురు ప్రతిభావంతులైన కథానాయికల కలయికలో తెరకెక్కుతున్న ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!