

సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘రొమాంచకం’. పెయిడ్ ప్రీమియర్స్ అనంతరం ఈ సినిమాపై సూపర్స్టార్ మహేశ్బాబు ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే విడుదలకు ముందు మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై తన తొలి అభిప్రాయాన్ని వెల్లడించిన మహేశ్బాబు.. ‘రొమాంచకం’ ఎంటర్టైనింగ్గా, ప్రామిసింగ్గా ఉందంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
సినిమా కోసం చిత్రబృందం చూపించిన ప్రేమ, ప్యాషన్, కష్టపడిన తీరు స్పష్టంగా కనిపిస్తోందని మహేశ్బాబు పేర్కొన్నారు. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వేణు గోపాల్ రెడ్డి రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. వాసుకి వైభవ్ సంగీతం అందించారు. ఉపేంద్ర లిమాయే, వెంకటేశ్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మహేశ్బాబు ప్రశంసలకు స్పందించిన సందీప్ రెడ్డి వంగా.. తన మద్దతుకు సూపర్స్టార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం నేడు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!