

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. జనవరి 8 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో నిర్వహించేందుకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరను రూ.800 (జీఎస్టీ అదనం), మల్టీప్లెక్స్లలో రూ.1000 (జీఎస్టీ అదనం)గా నిర్ణయించేందుకు అనుమతి కోరింది. అలాగే జనవరి 9 తెల్లవారుజామున 4 గంటల షోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అభ్యర్థించింది. అంతేకాకుండా డే 1 నుంచి రెగ్యులర్ టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో రూ.102, మల్టీప్లెక్స్లలో రూ.132 పెంపునకు అనుమతి ఇవ్వాలని సినిమాటోగ్రఫీ మంత్రి, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసినట్లు తెలిసింది. అయితే ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.
దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హారర్, మిస్టరీ, ఫాంటసీ అంశాలతో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన నాచో నాచో వీడియో సాంగ్, ట్రైలర్ 2.0 ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. కథలో రాజా సాబ్ తన తాత హవేలీలోకి అడుగుపెట్టి, అక్కడ ఉన్న హిప్నటైజింగ్ ఆర్కిటెక్చర్, దుష్ట శక్తులు, భూతప్రేతాల మధ్య చిక్కుకుంటాడు. ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి ఎలా బయటపడతాడన్నదే కథాంశం. ట్రైలర్లో ప్రభాస్ విభిన్న మేకోవర్స్తో కనిపించగా, చివర్లో జోకర్ను గుర్తు చేసే లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.












.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!