

ది ఇండియా స్టోరీ విడుదలకు ముందే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం సమాజాన్ని నేరుగా ప్రభావితం చేస్తున్న ఆహార కల్తీ సమస్యను ప్రధాన కథాంశంగా తీసుకుంది. ముంబై హైకోర్టు నేపథ్యంలో సాగే ఈ కోర్ట్రూమ్ డ్రామాలో కాజల్ న్యాయవాదిగా కనిపించనున్నారు. జూలై 24న విడుదల కానున్న ఈ సినిమా కల్తీ ఆహారం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
దర్శకుడు డి.కే. చైతన్య సామాజిక బాధ్యతతో కూడిన కథను కమర్షియల్ శైలిలో చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. శ్రేయాస్ తల్పాడే కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో భావోద్వేగాలతో పాటు బలమైన సందేశం కూడా ఉండబోతోంది. తాజాగా విడుదలైన ‘క్యాన్సర్ ఫైల్స్’ కాన్సెప్ట్తో కూడిన ప్రచార పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ప్రతి కుటుంబాన్ని తాకే అంశాన్ని ప్రస్తావిస్తున్న ఈ చిత్రం విడుదల తర్వాత చర్చలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!