

రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న మైసా సినిమా నుంచి ఓ పవర్ఫుల్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫీమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామాలో రష్మిక ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవతారంలో కనిపించారు. ముఖంపై గాయాలు, రక్తం, మట్టి ఉన్నప్పటికీ ఆమె కళ్లలో కనిపించే ఆగ్రహం, ధైర్యం ఆమె పాత్ర ఎంతటి కష్టాలను ఎదుర్కొందో తెలియజేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లతో పెరిగిన అంచనాలు ఈ పోస్టర్తో మరింత పెరిగాయి.
గోండు తెగ సాంస్కృతిక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక ఒక బలమైన గిరిజన యువతి పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్, భావోద్వేగాల కలబోతగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే రణబాలి చిత్రం నుంచి విడుదలైన ప్రత్యేక పోస్టర్, మేకింగ్ వీడియోలో ‘జయమ్మ’ పాత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులను ఆకట్టుకుంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!