

భారత ఆర్మీకి చెందిన గూఢచారులపై సినిమాల్లో చూపిస్తున్న తీరుపై మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆర్మీ ఆపరేషన్లను వాస్తవానికి దూరంగా, అతిగా స్టైలైజ్ చేసి చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా ‘ధురంధర్’ సినిమాను ప్రస్తావిస్తూ కొంతమేర మాత్రమే రియాలిటీకి దగ్గరగా ఉందని అన్నారు.
ఈ క్రమంలో మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై కూడా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్మీ సినిమాలు తనకు పెద్దగా నచ్చవని, వాటిని చూడటానికి కూడా వెళ్లనని తెలిపారు. ఆ సినిమాలో బాంబు సన్నివేశంలో హీరో కూర్చుని కాఫీ తాగడం లాంటి సీన్స్ తనకు హాస్యంగా అనిపించాయని అన్నారు.
థియేటర్లో ఆ సన్నివేశాన్ని చూసి నవ్వినప్పుడు తన స్నేహితుడు హెచ్చరించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆర్మీని అపహాస్యం చేసినట్లు అనిపించిందని, అందుకే సినిమా మధ్యలోనే బయటకు వచ్చేశానని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ‘సరిలేరు నీకెవ్వరు’ మరోసారి చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!