

సమంత రూత్ ప్రభు, బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మా ఇంటి బంగారం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సమంత సరదాగా స్పందించారు. నందిని రెడ్డితో 15 ఏళ్ల పరిచయం ఉందని, ఇక ఇరిటేషన్ అనేదే లేదని చెప్పారు. అలాగే రాజ్తో ఇప్పటివరకు ఎలాంటి వాదనలు జరగలేదని, ఇద్దరూ చాలా పర్ఫెక్ట్ అని కొనియాడారు.
చీరకట్టులో యాక్షన్ సీన్స్ చేయడం గురించి అడగగా, అది మాస్గా అనిపించిందని సమంత పేర్కొన్నారు. ‘మా ఇంటి బంగారం’ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఇందులో డ్రామా, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయని తెలిపారు. తిరుపతి యాసను సినిమాలో ఉపయోగించినట్టు రాజ్ వెల్లడించారు. ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్పై రాజ్తో కలిసి సమంత ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ, సమంత ఇప్పుడు నటిగా మరింత ఉన్నత స్థాయికి చేరుకుందని, కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్ని విభాగాల్లో అద్భుతంగా నటిస్తోందని ప్రశంసించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!