
సినిమాలు

సంధ్య థియేటర్ ఘటన కేసులో సినీనటుడు అల్లు అర్జున్ సోమవారం నాంపల్లి కోర్టులో వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ నిమిత్తం ముంబయిలో ఉండటంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణలో కొంతమంది నిందితులు కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం తదుపరి విచారణను జులై 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో 23 మంది నిందితులపై సిద్ధం చేసిన 500 పేజీల ఛార్జ్షీట్ ప్రతులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించగా, తదుపరి విచారణలో కేసు ముందుకు సాగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!