

‘మా ఇంటి బంగారం’ చిత్ర థ్యాంక్స్ మీట్లో సమంత తన జీవితంలో కొత్త దశ ప్రారంభమైందని చెబుతూ సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ దశ తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని, చిన్న విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సమంతకు విజయవంతమైన కమ్బ్యాక్ మూవీగా నిలిచిందని చిత్రబృందం పేర్కొంది. ఈ కార్యక్రమంలో రాజ్ నిడిమోరు, నందినీ రెడ్డి, శ్రీముఖి, దిగంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమంత తన కెరీర్, వ్యక్తిగత అనుభవాల గురించి మాట్లాడుతూ రిస్క్ తీసుకోకుండా ఎదుగుదల సాధ్యం కాదని, ముందుగా మనపై మనకు నమ్మకం ఉండాలని సూచించారు. ఆరోగ్య సమస్యల కారణంగా తీసుకున్న విరామం తర్వాత ఈ సినిమా తనకు ప్రత్యేకమైనదిగా నిలిచిందన్నారు. రాజ్ నిడిమోరు ఈ చిత్రం పూర్తిగా టీమ్ వర్క్ ఫలితమని చెప్పగా, దర్శకురాలు నందినీ రెడ్డి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ తర్వాత సమంత నటనలో వచ్చిన మార్పు ఈ సినిమాలో మరింత స్పష్టంగా కనిపించిందని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!