
జనరల్

ఏపీ గ్రూప్-1 నియామకాలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తుది నివేదిక సమర్పించింది. విచారణ సందర్భంగా 736 మంది అభ్యర్థుల జవాబు పత్రాలపై ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయినట్లు సిట్ కోర్టుకు తెలిపింది. నియామక ప్రక్రియలో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే అంశాన్ని పరిశీలించడంలో భాగంగా జవాబు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు వెల్లడించింది.
ఇదే సమయంలో మరో 9 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను సెకండ్ ఒపీనియన్ కోసం పంపినట్లు సిట్ తెలిపింది. వీరిలో ఇద్దరి జవాబు పత్రాలకు సంబంధించిన నివేదికలు అందాయని, మిగిలిన ఏడుగురి నివేదికలు రావాల్సి ఉందని కోర్టుకు వివరించింది. సిట్ వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఏపీ హైకోర్టు సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!