

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ధురందర్ 2 సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.రణ్వీర్ సింగ్ నటించిన ఈ సినిమాను ఆయన సాధారణ సినిమా కాదని, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ‘క్వాంటం లీప్’ అని అభివర్ణించారు. దర్శకుడు ఆదిత్య ధర్ తన మేకింగ్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశను చూపించారని, ప్రేక్షకుల మనస్తత్వాన్ని కూడా ప్రభావితం చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించారని ప్రశంసించారు.

ఈ సినిమాను షోలే, మొఘల్-ఎ-ఆజమ్ వంటి క్లాసిక్ చిత్రాలతో పోల్చుతూ, వాటికంటే ఇది వంద రెట్లు ప్రభావం చూపుతుందని ఆర్జీవీ అన్నారు. హాలీవుడ్ దర్శకులు స్టీవెన్ స్పీల్బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ కూడా ఈ సినిమా చూడాలని సూచించారు. ‘ధురందర్ 2’ రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే, దక్షిణాది సినిమాలకు గట్టి పోటీగా మారుతుందని, సౌత్ ఇండస్ట్రీ ఈ సినిమా నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!