

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు తమ ముగ్గురు చిన్నారులతో కలిసి కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ పిల్లలను శ్రీకృష్ణుడు, రాధారాణి రూపాల్లో ముచ్చటగా ముస్తాబు చేసి ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఉపాసన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు. కొణిదెల ఇంట్లోకి చిన్న కృష్ణుడు అడుగుపెట్టాడని, దీంతో తన కల నెరవేరిందంటూ ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా చిన్నారుల ముఖాలు స్పష్టంగా కనిపించకుండా దంపతులు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ క్యూట్ ఫొటోలకు మెగా అభిమానులు, నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. చాలామంది కుటుంబ వేడుకలను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తుండగా, మరికొందరు కవల పిల్లల ముఖాలను కూడా చూపించాలని కోరుతున్నారు. రామ్ చరణ్, ఉపాసనలకు 2023 జూన్ 20న తొలి సంతానంగా క్లీంకార జన్మించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కవలలు జన్మించగా, అబ్బాయికి శివరామ్, అమ్మాయికి అన్వీరా దేవి అని పేర్లు పెట్టారు. పిల్లల ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తున్న కొణిదెల కుటుంబం, కవలల ముఖాలను ఎప్పుడు అభిమానులకు పరిచయం చేస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!