
న్యూస్
.png&w=3840&q=75)
‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. అద్భుతమైన కంటెంట్తో పాటు దర్శకుడు ఆదిత్య ధర్ విజన్, హీరో రణవీర్ సింగ్ నటనపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రాన్ని అభినందిస్తూ ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమాగా పేర్కొన్నారు. ఈ ప్రశంసలకు దర్శకుడు ఆదిత్య ధర్ భావోద్వేగంతో స్పందిస్తూ, ఇది తనకు గొప్ప గౌరవమని తెలిపారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, ఎస్. ఎస్. రాజమౌళి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుబాటి, నాగార్జున అక్కినేని, అలాగే రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు.




















.png&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!