

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా, భద్రకాళి పిక్చర్స్ మరియు టీ–సిరీస్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న స్పిరిట్ చిత్రం అధికారికంగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ సందర్భానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై, ముహూర్తపు క్లాప్ కొట్టి చిత్రానికి శుభారంభం పలికారు.
ప్రభాస్ నటిస్తున్న ఈ అత్యంత ఆసక్తికర చిత్రానికి తొలి షూటింగ్ షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభమైంది. వరుస బ్లాక్బస్టర్లతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ ఓ పాన్–వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటోంది. టీ–సిరీస్ ఫిల్మ్స్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయి కథనంతో, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అనిమల్ చిత్రంలో ప్రత్యేకమైన నటనతో ఆకట్టుకున్న త్రిప్తి దిమ్రీ, ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటిస్తోంది. వీరి కొత్త జోడీపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. అదనంగా వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్, సీనియర్ నటి కాంచన ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన వినూత్నమైన “సౌండ్–స్టోరీ” ఆడియో టీజర్కి అదిరిపోయే స్పందన లభించింది. ఇందులో విజువల్స్ లేకపోయినా, వినిపించిన సౌండ్ డిజైన్ ప్రేక్షకుల్లో పెద్ద ఆశలు రేకెత్తించింది. స్పిరిట్ ను నిజమైన గ్లోబల్ సినిమాగా రూపొందిస్తున్నారు. మొత్తం తొమ్మిది భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండటం ఈ సినిమా స్థాయిని మరింతగా సూచిస్తోంది. షూటింగ్ ప్రారంభంతోనే ఈ భారీ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!