

ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, డబ్బింగ్ చిత్రాల నిర్మాత హరి గుజ్జలపూడి (47) హఠాన్మరణం పట్ల టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరి మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన చెందారు. ఆయనతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నాగార్జున భావోద్వేగభరిత సంతాప సందేశాన్ని విడుదల చేశారు.
నెల్లూరు జిల్లాకు చెందిన హరి గుజ్జలపూడి, తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే ఆయనకు గుండెపోటు రావడంతో ఆకస్మికంగా మరణించారు. పంపిణీదారుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన సుపరిచితులు. హరి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఈ సందర్భంగా నాగార్జున స్పందిస్తూ, "గుజ్జలపూడి హరి కుమార్ మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురయ్యాను. ఆయనతో మాకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. అక్కినేని కుటుంబానికి ఆయన ఒక మూలస్తంభం లాంటి వారు. మా జీవితాల్లో ఆయన లేని లోటు పూడ్చలేనిది. తెలుగు సినీ పరిశ్రమ ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ను, గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!