
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ముంబయిలో విజయవంతంగా భుజం శస్త్రచికిత్స జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా. దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయన కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించింది. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో శస్త్రచికిత్స అవసరమైందని వైద్యులు తెలిపారు. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తైంది.
శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ను ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్కు తరలించారు. ప్రస్తుతం ఆయన మత్తుమందు ప్రభావం నుంచి కోలుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తదుపరి చికిత్స, పునరావాస ప్రక్రియపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!