
బిజినెస్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ వ్యాపార వ్యూహాల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కొన్ని భారీ చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం, అలాగే ఓటీటీ–శాటిలైట్ మార్కెట్ మందగించడం నేపథ్యంలో మిడ్-రేంజ్ ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు టాక్ వినిపిస్తోంది.
దీంతో వరుణ్ తేజ్, శర్వానంద్, నితిన్ వంటి హీరోలతో ప్లాన్ చేసిన కొన్ని సినిమాలు ప్రస్తుతానికి హోల్డ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భారీ స్టార్ హీరోల సినిమాలపైనే దృష్టి పెట్టిన ఈ సంస్థ, మార్కెట్ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మిడ్ రేంజ్ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!