

‘వీరసింహారెడ్డి’ తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్బీకే111పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో, సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
విడుదలకుముందే ఈ చిత్రానికి భారీ ఓటీటీ ఒప్పందం కుదిరింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఒప్పంద విలువను వెల్లడించకపోయినా, ఫ్యాన్సీ ధరకు ఈ డీల్ కుదిరినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!