చెక్ బౌన్స్ కేసులో ‘కొచ్చడైయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) సినిమా నిర్మాతకు మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు నాలుగు వారాల లోపు రూ.2.5 కోట్లు చెల్లించాలని, అలా చేయకపోతే ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా, ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 2014లో విడుదలైన 3డీ మోషన్ క్యాప్చర్ చిత్రం ‘కొచ్చడైయాన్’ ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ సినిమా నిర్మాణ అవసరాల కోసం బెంగళూరుకు చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ డైరెక్టర్ మురళీమనోహర్ రుణం తీసుకున్నారు. అప్పు తిరిగి చెల్లించేందుకు 2014లో ఆయన యాడ్ బ్యూరో మేనేజింగ్ డైరెక్టర్ అబిర్ చంద్ నహర్కు రూ.5 కోట్ల చెక్ ఇచ్చారు. అయితే ఆ చెక్ బౌన్స్ కావడంతో న్యాయపోరాటం మొదలైంది.
ఈ కేసులో ట్రయల్ కోర్టు ఇప్పటికే మురళీమనోహర్కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ఆయన మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ జరిపిన హైకోర్టు, నిర్ణీత గడువులోపు రూ.2.5 కోట్లు చెల్లించాలని, లేకపోతే జైలు శిక్ష తప్పదని తుది హెచ్చరిక జారీ చేసింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!