
జనరల్

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై కీలక సమావేశం జరిగింది. ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఉన్న వివాదాలు, టికెట్ రేట్ల సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ భేటీకి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి సురేష్ బాబు నేతృత్వం వహించారు.
ఈ సమావేశానికి దిల్ రాజు, అల్లు అరవింద్, చెరుకూరి శ్రీనివాస రావు, స్రవంతి రవి కిషోర్, సుధాకర్ రెడ్డి, ఠాగూర్ మధు, రాధామోహన్ సహా దాదాపు 50 మంది నిర్మాతలు హాజరయ్యారు. ఎగ్జిబిటర్స్ తరఫున విజయేందర్ రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు. ఇటీవల చోటు చేసుకున్న వివాదాలు, సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా ఈ చర్చలు జరిగినట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!