
జనరల్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఆయన సతీమణి బుష్రా బీబీ, సోదరి నొరీన్ బుధవారం ఆడియాలా జైలులో కలిశారు. కుటుంబ సభ్యులను వారానికి ఒకసారి కలిసేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ భేటీ జరిగింది. మరోవైపు, ఇమ్రాన్ను ఆస్పత్రికి తరలించేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
తోషాఖానా, అల్-ఖాదిర్ ట్రస్ట్ తదితర కేసుల్లో శిక్ష పడిన ఇమ్రాన్ కొంతకాలంగా జైలులోనే ఉన్నారు. ఒంటరితనం, కుటుంబ సభ్యులతో భేటీకి పరిమితులు, ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయనపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇమ్రాన్ను వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పాక్ సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!