
రాజకీయాలు

‘శ్రీనివాస మంగాపురం’ పాత్రల పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. అజయ్ భూపతి దర్శకత్వంలో, అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కూడా ఈ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తున్నారు. జూలై 9న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ తాతయ్య కృష్ణ గారిని దేవుడిగా భావిస్తున్నానని, మహేష్ బాబు తనకు ఎప్పటికీ ప్రేరణ అని భావోద్వేగంగా చెప్పారు. దర్శకుడు అజయ్ భూపతి జయకృష్ణలో కృష్ణ గారి లక్షణాలు ఉన్నాయని ప్రశంసించారు. రాఘవేంద్రరావు, అశ్వినీ దత్, రఘురామకృష్ణంరాజు, ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు. జివి ప్రకాష్ సంగీతం, విజువల్స్, టెక్నికల్ వర్క్పై ప్రశంసలు కురిపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!