

‘నారీ నారీ నడుమ మురారి’ విజయోత్సవంలో హీరో శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయం విలువ తనకు బాగా తెలుసని, ఈ సినిమాతో నిర్మాత అనిల్ సుంకర తనకు గొప్ప హిట్ ఇచ్చారని అన్నారు. తదుపరి అనిల్ సుంకరతో చేసే సినిమాకు రూపాయి కూడా తీసుకోనని, హీరో–నిర్మాత కలిసి నిజాయితీగా పనిచేస్తే ఎలా విజయం సాధించవచ్చో చూపిస్తామని తెలిపారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించగా, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఇక శ్రీవిష్ణుతో కలిసి నటించే విషయంపై శర్వానంద్ స్పందిస్తూ, శ్రీవిష్ణు ఎంతో మంచి మనసుతో ఈ సినిమాలో చిన్న పాత్ర చేశారని ప్రశంసించారు. సినిమాపై, స్నేహంపై నమ్మకంతో ఒక హీరో చిన్న పాత్రలో నటించడం గొప్ప విషయం అని అన్నారు. ఇద్దరికీ సరిపోయే బలమైన కథ దొరికితే అనిల్ సుంకర నిర్మాణంలో కలిసి సినిమా చేయడానికి సిద్ధమని వెల్లడించారు. ఈ విజయం తర్వాత తమపై బాధ్యత మరింత పెరిగిందని, తదుపరి సినిమా ఇంకా మెరుగ్గా ఉండేలా చూసుకుంటామని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!