

‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్తో కలిసి ‘పెద్ది’ చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితం, కుటుంబం, ఆధ్యాత్మికత, భవిష్యత్ కలల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘పెద్ది’ చిత్రంలో అచ్చియమ్మ పాత్రలో కనిపించనున్నానని, ఈ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపింది. ముంబైలో నివసిస్తున్నప్పటికీ హైదరాబాద్ తనకు రెండో ఇల్లులా అనిపిస్తుందని, భవిష్యత్తులో తెలుగు, తమిళ చిత్రాల్లో మరింతగా నటించాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.
జాన్వీ తన తల్లి శ్రీదేవి మరణం తర్వాత తీవ్ర నిరాశకు గురైన విషయాన్ని గుర్తు చేసుకుంది. తల్లి జ్ఞాపకాలే తనను ముందుకు నడిపిస్తున్నాయని తెలిపింది. చిన్నప్పటి నుంచి తండ్రి ధూమపానం మానేయాలని ప్రయత్నించేదాన్నని, సిగరెట్లను పాడుచేసేదాన్నని చెప్పింది. కొవిడ్ కాలంలో కొంతకాలం మద్యం సేవించినప్పటికీ ఆ అలవాటు పూర్తిగా మానేశానని వెల్లడించింది. తన సోదరి ఖుషీతో ప్రత్యేక అనుబంధం ఉందని, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిపై అపార భక్తి ఉందని తెలిపింది.
భవిష్యత్తులో వివాహం చేసుకుంటే తిరుపతిలో సాధారణంగా జరుపుకోవాలని, ముగ్గురు పిల్లలతో అక్కడే స్థిరపడాలని తన కోరిక అని జాన్వీ పేర్కొంది. రోజూ ‘గోవింద’ నామస్మరణ చేయడం, అరిటాకులో భోజనం చేయడం తన చిరకాల ఆశ అని చెప్పింది. మనుషులలోని అంతఃసౌందర్యాన్ని ఎక్కువగా గౌరవిస్తానని, జీవితాన్ని ఎప్పుడూ సానుకూల దృక్పథంతో చూస్తానని జాన్వీ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!