
రాజకీయాలు

విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం రణబాలిలోని ‘ఏందయ్య సామీ’ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. లక్షకు పైగా రీల్స్తో ఈ సాంగ్ ట్రెండింగ్లో నిలిచింది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.

ఈ పాటను సినిమాలో విజయ్, రశ్మిక పెళ్లి వేడుక సందర్భంగా చిత్రీకరించారు. 19వ శతాబ్దపు సంప్రదాయ పెళ్లి వేడుకల వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రణబాలి రూపొందుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!