
సినిమాలు
.jpg&w=3840&q=75)
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన పలువురు సెలబ్రిటీలపై నమోదైన కేసులో సీఐడీ సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా మంగళవారం హైదరాబాద్ లక్డీకాపూల్లోని సీఐడీ కార్యాలయానికి సినీ నటి మంచు లక్ష్మి, రీతూ చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ హాజరయ్యారు.
సుమారు రెండు గంటల పాటు వీరిని సీఐడీ అధికారులు వేర్వేరుగా ప్రశ్నించినట్టు సమాచారం. ప్రధానంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా వారికి వచ్చిన ఆదాయం, ఆయా యాప్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలపై విచారణ జరిపినట్టు తెలుస్తోంది.
ప్రచారానికి ప్రతిగా ఎంత పారితోషికం అందిందో, ఒప్పంద నిబంధనలు ఏవిధంగా ఉన్నాయో, చట్టపరమైన అనుమతులు తీసుకున్నారా అనే అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నలు సంధించినట్టు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విచారణలు కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!