

టాలీవుడ్ను ఏళ్లుగా వేదిస్తున్న పైరసీకి చివరకు గట్టి దెబ్బ పడింది. IBomma వెబ్సైట్కు అసలు మాస్టర్మైండ్గా ఉన్న ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇండస్ట్రీ మొత్తం ఊపిరి పీల్చుకుంది. పోలీసులు అతడి లాగిన్ యాక్సెస్తో సైట్ను బ్లాక్ చేసి, బ్యాంకుల్లోని 3 కోట్ల రూపాయలు ఫ్రీజ్, వందలాది హార్డ్డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మీడియా సమావేశంలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబు, దిల్ రాజు--all united.
చిరంజీవి స్పందిస్తూ:
“స్టార్ హీరోలే కాదు, స్పాట్ బాయ్స్ నుండి డ్రైవర్స్ వరకు లక్షలాది కుటుంబాల జీవితం సినిమాలపై ఆధారపడి ఉంది. ఇంత కష్టాన్ని ఒకడు వచ్చి దోచుకుంటే ఎలా?
మరి ‘దమ్ముంటే పట్టుకోండి’ అని సవాళ్లు విసరడం అసహ్యం!” అన్నారు.
సీపీ సజ్జనార్ పైరసీని అణచి వేయడంలో చూపిన చొరవకు
చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
“ఇలా ఇండస్ట్రీ-పోలీస్ కలిసి పనిచేస్తే,
ఒకరోజు పైరసీ అనే రాక్షసం పూర్తిగా అంతరించిపోతుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.




.png&w=3840&q=75)








.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!