

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శివానీ నాగారం తాజా చిత్రం హే బలవంత్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో ఆమె సుహాస్తో కలిసి నటించగా, గోపీ అచ్చర దర్శకత్వం వహించారు. మొదట వేరే టైటిల్తో రూపొందిన ఈ సినిమా సెన్సార్ సూచనలతో పేరు మార్చుకుంది. ఫిబ్రవరి 20 న విడుదల కానున్న ఈ చిత్రం తండ్రీ – కొడుకుల భావోద్వేగాన్ని ప్రధానంగా చూపించే వినోదాత్మక కథగా రూపొందింది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడిన శివానీ, ఈ సినిమాలో తాను అమాయకంగా కనిపిస్తూ నవ్వులు పంచే పాత్రలో నటించానని తెలిపారు.
గాయని, కూచిపూడి నృత్యకారిణిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన శివానీ, 2024 లో విడుదలైన అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రంతో హీరోయిన్గా పరిచయమై తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె కథా ప్రధాన చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్లో ముందుకు సాగుతున్నారు. సుహాస్తో కలిసి నటించిన తొలి చిత్రం తర్వాత మళ్లీ ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉందని, ఈసారి పూర్తిస్థాయి వినోదాత్మక పాత్రలో కనిపిస్తానని శివానీ తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!