తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’ విడుదలపై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదట జులై 31న విడుదల చేయాలని చిత్రబృందం భావించినట్లు సమాచారం. అయితే విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, థియేటర్లలో పోటీని నివారించేందుకు ‘సిగ్మా’ విడుదలను ఆగస్టుకు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, జాసన్ సంజయ్ త్వరలో నటుడిగా కూడా వెండితెరకు పరిచయం కానున్నారనే వార్తలు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ నిర్మాత జీకేఎమ్ తమిళ్ కుమారన్ తన బ్యానర్పై సంజయ్ను హీరోగా పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శకుడిగా తన తొలి చిత్రంతో సిద్ధమవుతున్న సంజయ్, నటుడిగానూ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!